పిఆర్‌సి ఎరియల్స్‌ అందరికీ ఇవ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌

Dec 21,2023 16:51 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : 2017 పిఆర్‌సి ఎరియల్స్‌ ఉద్యోగులందరికీ ఇవ్వాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి యు.రాములు డిమాండ్‌ చేశారు. గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 సర్కులర్‌ను విధిగా అమలు చేయాలన్నారు. 4సంవత్సరాల లీవ్‌ ఎన్‌కేస్‌మెంట్‌ను వెంటనే ఇవ్వాలన్నారు. ఎస్‌ఆర్‌బిఎస్‌ పెన్షన్‌ను కొనసాగించాలన్నారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలన్నారు. కేడర్‌ స్కేల్‌ పేరుతో హెచ్‌ఆర్‌ఎ కొతను విరమించుకోవాలన్నారు. పిఎఫ్‌ ఖాతాలో డబ్బులు లేని వారికి హైయర్‌ పెన్షన్‌ కొరకు స్పెషల్‌ ఆన్లైన్‌ ఇప్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ ఫర్స్‌ పరిష్కరించాలని కోరారు. అన్ని కేటగిరీలో ఉన్న ఖాళీలను ప్రమోషన్స్‌ ద్వారా భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.వి.రావు, కె.ఆర్‌.కుమార్‌, బి.సోమేశ్వరరావు, ఆర్‌.ఎ.నాయుడు, వి.రాములు, సి హెచ్‌.వి.రావు తదితరులు పాల్గొన్నారు.

➡️