పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత

ప్రజాశక్తి – వెలిగండ్ల : పార్టీ కోసం కష్టపడేవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని, అందుకు 42 ఏళ్లగా పార్టీని నమ్ముకొని ఉన్న దొడ్డ వెంకట సుబ్బారెడ్డి ఉదాహరణ అని టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. దొడ్డ వెంకట సుబ్బారెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు అయిన సందర్భంగా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి కనిగిరి నియోజక అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం వెంకటసుబ్బారెడ్డి పనిచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, గోనా ప్రతాప్‌, షేక్‌ షరీఫ్‌, బేరి పుల్లారెడ్డి, గోనా వెంకటయ్య పాల్గొన్నారు.

➡️