ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ …. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను చేధించి కలెక్టరేట్ గేటు ముందు సర్పంచులు బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.