పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్
కదిరి టౌన్ : తనకల్లు మండలానికి చెందిన వైసిపి, జనసేన నాయకులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం పట్టణంలోని కందికుంట నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. తిరుమల్లయ్య గారి పల్లి మండెం వెంకట్ రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షులు, మాజీ సర్పంచి వి.వెంకట రమణప్ప, పి.రామచంద్ర, మని,జనసేన నాయకులు గజేంద్ర నాయక్, అజిత్ నాయక్, ధనలక్ష్మి తదితరులకు పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కదిరి నియోజకవర్గ పరిశీలకులు వాహీద్, పివి.పవన్ కుమార్ రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ సింగల్ విండో సభ్యులు చలపతి తదితరులు పాల్గొన్నారుమోహినీ