ఐపీఎల్-2024లో బాగంగా చెన్నైతో మ్యాచులో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో సిమర్జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే చెన్నైకి ఈ మ్యాచ్ కీలంకం కావడంతో అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.