అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయం

May 9,2024 22:57

రోడ్‌షోలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ   

                    హిందూపురం : తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా లేకుండా కషిచేస్తానని, అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఎన్నికల ప్రచారంలో బాగంగా రూరల్‌ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పార్థ సారథితో కలిసి జెవిఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ లో జరిగిన కురుబల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా పార్థ సారథిలను ఆదరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు, కురుబలు పాల్గొన్నారు.

➡️