విద్యుత్ కాంతుల్లో పలాసలోని ఓ చర్చి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను సందడిగా నిర్వహించారు. అన్ని చర్చిల్లో ఆదివారం సాయం త్రం నుంచే చర్చిల్లో వేడుకలు ప్రారంభమయ్యా యి. అర్ధరాత్రి కేకును కోసి ఏసుక్రీస్తును స్తుతిస్తూ గీతాలను ఆలపించారు. శ్రీకాకుళం చిన్నబజారు లోని తెలుగు బాప్టిస్టు చర్చి, ఉమెన్స్ కాలేజ్ రోడ్డులోని క్రిస్టియన్ వర్షిప్ సెంటర్, కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలోని సెయింట్ జాన్ లూథరన్ చర్చి, డగ్లస్ స్కూల్ క్యాంపస్లోని కీన్స్టోన్ చర్చి, పాత శ్రీకాకుళంలోని రార్డ్ అసెంబ్లీ చర్చి, పురుషుల డిగ్రీ కళాశాల సమీపంలోని ఆర్సి ఎం చర్చి, టౌన్హాల్ వద్ద సెయింట్ థామస్, పలాసలోని సీయోస ్గ్రీస్, హెర్మాన్ గ్రీస్, పలు చర్చిల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.