చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

Nov 23,2023 21:39
ఆమదాలవలస చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సనపల ఢిల్లేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో

ప్రజాశక్తి- ఆమదాలవలస

చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సనపల ఢిల్లేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గాజుల కొల్లివలస గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో నొక్కేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో సాధించిన ప్రగతి ఏమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు అమలు చేసే కార్యక్రమాలపై వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి కోరుకొండ రమణమూర్తి, టిడిపి నాయకులు ఎండ భీష్మారావు, గుండు రవికుమార్‌ పాల్గొన్నారు.మెళియాపుట్టి : మండలంలోని జాడుపల్లిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి టిడిపి మేనిఫోస్టో పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భాస్కర్‌గౌడ, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు బూర్ల లలిత కుమారి, జాడుపల్లి ఎంపిటిసి కదంబల సుజాత, రాజు, చాపర మాధవరావు, పరమేశ్వరరెడ్డి, బమ్మిడి భాస్కరరావు, మాలతి శ్రీధర్‌, దుక్క బాలరాజు, హనుమంతు చంద్రశేఖర్‌, అగాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి నాయకులు బెండి అన్నపూర్ణ అన్నారు. మండలంలోని శ్రీజగన్నాథపురం పంచాయతీ బిర్లంగిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి మేనిఫోస్టో పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొర్రాయి మల్లేషు, సాసుమంతు ఆనంతరావు పాల్గొన్నారు.

ఆమదాలవలస : పోస్టర్‌ను అందజేస్తున్న ఢిల్లేశ్వరరావు

➡️