వివరాలు సేకరిస్తున్న ఎస్పి రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
విద్యార్థులు సాఫీగా పది పరీక్షలు రాలయిన ఎస్పి జి.ఆర్.రాధిక సూచించారు. నగరంలోని శ్రీచైతన్య, కేశవరెడ్డి పాఠశాలల్లో జరుగుతున్న పదో పరీక్షా కేంద్రాలను శనివారం పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, స్మార్వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షాకేంద్రాలకు తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనికీలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వల్ల 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీప ప్రాంతాల్లో పరీక్ష పూర్తయ్యే వరకు జిరాక్స్ షాపులకు అనుమతించరాదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.