కాంగ్రెస్‌లో 50 కుటుంబాలు చేరిక

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని

పార్టీలోకి ఆహ్వానిస్తున్న త్రినాథ్‌బాబు

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం, లేబర్‌ కాలనీకి సంబంధించి 50 కుటుంబాలు కాంగ్రెస్‌ నాయకులు బద్రి సీతమ్మ ఆధ్వర్యాన కాంగ్రెస్‌ అభ్యర్థి మజ్జి త్రినాథ్‌బాబు సమక్షంలో ఇండియా ఫోరంలో మంగళవారం చేర్చుకున్నారు. ఈ సందర్భంగా త్రినాథ్‌బాబు మాట్లాడుతూ సీతమ్మ ఆధ్వర్యాన వీరంతా కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని, సరళీకృత ఆర్థిక విధానాలు కాంగ్రెస్‌ తీసురావడంతో సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు.

➡️