ఆదర్శిస్తే అభివృద్ధి చేస్తా : సురేష్‌

ప్రజాశక్తి -శింగరాయకొండ : తనను ఆదరిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని వైసిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. జరుగుమల్లి మండల పరిధిలోని వావిలేటిపాడు, జరుగుమల్లి, చింతల పాలెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే కొండపి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేసి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తిన మదన మనోహర్‌, పిన్నికి, శ్రీనివాసరావు , పల్లా అనురాధ, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️