అధ్యాపకురాలు చండికుమారికి విశిష్ట శాస్త్రవేత్త అవార్డుప్రజాశక్తి – క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం అప్లైడ్ మైక్రో బయాలజీ విభాగం ఆచార్యులు డాక్టర్ చండీ కుమారి విశిష్ట శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఇండియా నేసియాలోని బాలి ప్రాంతంలోని ఉదయాన యూని వర్సిటీ ఆధ్వర్యంలోని నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబులిటీ డివిజన్ వారు 4 వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రదానం చేశారు. ఆచార్య చండీ కుమారి చేసిన బోధన, పరిశోధన సేవలను గుర్తించి ఈ అవార్డును ఇండోనేషియాలో బహూకరించినట్లు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా పలువురు ఆచార్యులు, పరిశోధ కులు, వర్సిటీ ఉన్నతాధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.