ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతుప్రజాశక్తి -తిరుపతి టౌన్ఎస్ఎస్ఎ ఉద్యోగుల సమ్మెకు తిరుపతి బిఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. తిరుపతి తిలక్ రోడ్డు పాత మునిసిపల్ ఆఫీస్ సర్కిల్ నందు సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఎ ఉద్యోగులకు బిఆర్ఎస్ రాష్ట్రనాయకులు ఆర్కాట్ కష్ణప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ, ఐక్య కార్యాచరణ సమితి తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లోని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 16 నుండి 19వ తేదీ వరకు పెన్డౌన్ సహాయ నిరాకరణ, 20వ తారీకు నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. వారి ప్రధాన డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించాలన్నదేనన్నారు. మద్దతుగా రాఘవరెడ్డి, గురునాథం, రాజేంద్ర, రామారావు పాల్గొన్నారు.
![ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/12121212-2.jpg)