తిరుపతి సీటు స్థానికులకే ఇవ్వాలి : సుగుణమ్మ తిరుపతి టౌన్ : తిరుపతి ఎంఎల్ఎ అభ్యర్థి స్థానికుడు కాదని, చిత్తూరు నుంచి వలస వచ్చారని, ప్రచారంలో ఈ ఇబ్బందిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ అన్నారు. తిరుపతిలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత 57 నెలలుగా అటు జగన్మోహన్రెడ్డి పాలనపై ఇటు తిరుపతిలో భూమన అభినరురెడ్డి చేస్తున్న అరాచక పాలనను టిడిపి, జనసేన పార్టీలు ఎదుర్కొన్నాయన్నారు. స్థానికులకే టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా వైసిపిని ఘోరంగా ఓడిస్తామన్నారు. ఈ సమావేశంలో మహేష్యాదవ్, చిన్నబాబు, బ్యాంకు శాంతమ్మ పాల్గొన్నారు.
![తిరుపతి సీటు స్థానికులకే ఇవ్వాలి : సుగుణమ్మ](https://prajasakti.com/wp-content/uploads/2024/03/araniarani-scaled.jpg)