టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో ఆదిమూలం

Mar 29,2024 12:32 #Tirupati district

ప్రజాశక్తి – పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో 42వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కోసం 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 9 నెలలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుల పోరాడి పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే 10 సంవత్సరాల మునుపు సత్యవేడు టిడిపి కంచుకోటగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే కావున గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు 45 రోజులు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ క్లస్టర్ ఇన్చార్జి ఇలంగోవరెడ్డి, పద్దు రాజు, రామచంద్ర రాజు, జయచంద్ర నాయుడు, భాస్కరన్ , ఆరుల్ ప్రకాష్, రవి, వాసు, ఢిల్లీ బాబు, భర్త రెడ్డి, మణి గండ, మునుస్వామి, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️