ప్రజాశక్తి-తడ : వైఎస్ఆర్సీపీ నాయకుల అధ్వర్యంలో తడ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విచ్చేసి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తడ బొడిలింగాల పాడు రోడ్డు వద్ద స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తడ బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోవైఎస్ఆర్సీపీ నాయకులు జే సి యస్ కన్వినర్ సుందర్ రెడ్డి, తడ సర్పంచ్ మరియు మండల కన్వినర్ ఆర్ముగం, జయకుమార్ రెడ్డి, మునస్వామి రెడ్డి తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![cm jagan birth day celebrations tada](https://prajasakti.com/wp-content/uploads/2023/12/cm-jagan-birth-day-celebrations-tada.jpg)