రోడ్డుపై తన్నుకున్న వైసిపి కార్యకర్తలు

రోడ్డుపై తన్నుకున్న వైసిపి కార్యకర్తలు

రోడ్డుపై తన్నుకున్న వైసిపి కార్యకర్తలుప్రజాశక్తి – ఓజిలి వైసిపిలో గ్రూప్‌ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసి రోడ్డుపై తన్నుకున్న సంఘటన మండల పరిధిలోని మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఓజిలి మండలం మాచవరం గ్రామంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్‌ఆర్సిపి అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ప్రచారంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదం జరగడంతో గందరగోళం నెలకొంది . మాచవరం గ్రామానికి చెందిన నాయకులు పుల్లారెడ్డి , మధు రెడ్డి గ్రూపులు ప్రచారానికి వచ్చిన అభ్యర్థి సంజీవయ్యను మొదటగా తమ ప్రాంతంలోని ప్రచారం ప్రారంభించాలని వాగ్వివాదం చేయడంతో మనస్థాపానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ప్రచారం చేయకుండానే వెనుతిరిగారు. అభ్యర్థి తిరిగి వెళ్లిపోవడంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

➡️