కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి

May 10,2024 09:56 #died, #electric shock, #Two cultists

ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద జరిగింది. కడపాలెం గ్రామానికి చెందిన అజ్జల సోమ నాయుడు, చౌడుపల్లి రాజు అనే ఇద్దరు మత్స్యకారులు చెరువు గట్టుపై విద్యుత్‌ దీపాలకు వేసిన కరెంటు వైర్లు తగిలి మృతి చెందారు. మృతుల కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. ప్రమాద సంఘటన చూడడానికి పూడిమడక పంచాయతీకి చెందిన ప్రజలు తరలివస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️