ఓటు వేసేందుకు వస్తూ…

May 11,2024 21:46

సీతానగరం: ఈనెల 13న జరగనున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు మండలంలోని లక్ష్మీపురా నికి చెందిన గవర ముసలినాయుడు (24) సొంత గ్రామానికి వస్తుండగా వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తెలంగాణలోని బూపల్లి జిల్లాలోని రామగుండంలో ఓ కంపెనీలో సీతానగరం మండలం లక్ష్మీపురానికి చెందిన ముసలినాయుడు (సాయి) పనిచేస్తున్నాడు. సొంత గ్రామంలో ఓటేసేందుకు ఆయనతో పాటు స్నేహితులను డ్రాప్‌ చేయడానికి వరంగల్‌ బస్టాండ్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాయితో పాటు స్నేహితులను ట్రిప్పర్‌ ఢకొీంది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి మృతితో తండ్రి గోపాలం, తల్లి కన్నతల్లి, చెల్లి రాధ కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు. అందివచ్చిన కుమారుడు చనిపోవడంతో రోదిస్తున్నారు.

➡️