ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర మాజీ అటవీశాఖ మంత్రి పెద్దింటి జగన్మోహనరావును టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన ఓటును అభ్యర్దించారు. స్థానిక 28వ వార్డులో గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీమంత్రి పెద్దింటి జగన్మోహనరావును ఆయన ఇంటిలో బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి కలిసి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మాజీమంత్రి పెద్దింటి గెలుపుకు బేబినాయన కష్టపడి పని చేశారు. రానున్న ఎన్నికల్లో బేబినాయన గెలుపుకు పని చేసి రుణం తీర్చుకోవాలని పెద్దింటిని టీడీపీ కార్యకర్తలు కోరారు.