మరో అవకాశం ఇవ్వండి : కోలగట్ల

Apr 27,2024 15:46 #vijayanagaram, #YCP

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 42 వ డివిజన్‌ కామాక్షి నగర్‌ తదితర ప్రాంతాలలో డిప్యూటీ స్పీకర్‌, వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. స్థానీకులను కలుసుకొని ఐదేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధిని వివరించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమ అంశాలను విశదపరిచారు. ప్రజా మద్దతును కోరారు. రానున్న ఎన్నికలలో మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ ఇన్చార్జి డాక్టర్‌ వి ఎస్‌ ప్రసాద్‌, కార్పొరేటర్‌ పిన్నింటి కళావతి, డాక్టర్‌ సంధ్య, మేయర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ నాగాభిషేక్‌, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️