బైక్ పైకి దూసుకెళ్ళిన ప్రైవేటు బస్సు

Apr 12,2024 12:09 #Visakha

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరిపురం టేనెట్ ఎదురుగా శ్రీలక్ష్మి గణపతి గుడి వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనంపై నుండి వెళ్లడంతో రాజకుమార్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణరాజాపురం చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన  వెంటనే ట్రాఫిక్ ఏ డి సి పి ఆర్ శ్రీనివాస్ ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు, ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.  రాజకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ఇద్దరినీ ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి ద్వారక ట్రాఫిక్ సిఐ విచారణ చేపట్టారు.

➡️