ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 89వ వార్డు పరిధి గణపతినగర్, ఆప్పలనరసింహనగర్ కాలనీ, కొత్తపాలెం తదితర ప్రాంతాల్లో టిడిపి, జనసేన నాయకులతో కలిసి కూటమి అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు ప్రచారం నిర్వహించారు. అయా గ్రామాల్లో ప్రజలు గణబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు చూపిస్తున్న ఆదరాభిమానం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. ఇక్కడ సమస్యలన్నీ తనకు తెలుసని, కూటమి అధికారంలో రాగానే వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేష్, వార్డు అధ్యక్షుడు విజరుకుమార్ పాల్గొన్నారు.
![Ganababu pracharam](https://prajasakti.com/wp-content/uploads/2024/05/1-Ganababu-1.jpg)