సేవకుడే నాయకుడు కావాలి

ప్రజాశక్తి – చింతలపూడి

సేవకుడే నాయకుడు కావాలని, సేవ చేసే వారిని నాయకుడుగా ఎన్నుకోవాలని సొంగా విజయ రోషన్‌ అన్నారు. చింతలపూడిలోని ఆంథోనీ నగర్‌ కాలనీలో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ సతీమణి సొంగా విజయ శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కూటమిని ఆశీర్వదించాలని, ఎంఎల్‌ఎ, ఎంపీ అభ్యర్థుల సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. చింతలపూడిలోని గంటావారివీధిలో పట్టణాధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో బూత్‌ కన్వీనర్‌ దొడ్డిగర్ల ప్రభాకర్‌, అడ్డాల రవి, గణేశ్వరరావు, గంటా నాగభూషణంతో కలిసి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ను, ఎంఎల్‌ఎ అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కొన్ని ఏరియాల్లో డ్రెయినేజీలు లేక ఇళ్లల్లోకి మురుగునీరు వెళ్తోందని, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గంటావారివీధిలో 2 రోజులకు ఒకసారి అది కూడా గంట మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ బోడా అనీష్‌ కుమార్‌, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, సీనియర్‌ నాయకులు తాటి అప్పారావు, తిరుమిల్లి రామారావు, మన్యం సత్తిబాబు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజరు, బిజెపి నాయకులు తోట నారాయణ పాల్గొన్నారు.

➡️