ప్రజాశక్తి – నరసాపురం
మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలోని కుళాయి చెరువును శనివారం ఎంఎల్ఎ బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. తాగునీటిని పరిశీలించి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్ ఎఇ లోకేష్ని ఆదేశించారు. అనంతరం లక్ష్మణేశ్వరం చెరువు పక్కన ఉన్న కాలనీని పరిశీలించారు. స్థానిక సమస్యలను జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ ఎంఎల్ఎకు వివరించారు. తాగునీరు, విధి దీపాలు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కరిస్తానని ప్రజలకు నాయకర్ భరోసా ఇచ్చారు.