రోడ్డు పనులు నాణ్యతగా చేయాలి

ఎంఎల్‌ఎ నాయకర్‌

ప్రజాశక్తి – నరసాపురం

రోడ్డు పనులు నాణ్యతగా చేయాలని నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. మండలంలోని వేములదీవి పడమర గ్రామంలో ఆదివారం సెంటర్‌లో రోడ్డు మరమ్మతు పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈమేరకు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌, వాతాడి ఉమ పాల్గొన్నారు.

➡️