ముగిసిన ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి – ఆచంట

సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో తెరపడింది. ఆఖరి రోజు శనివారం టిడిపి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ తనయుడు పితాని భానుచందర్‌ నియోజవర్గంలో రోడ్‌ షో నిర్వహించి, సాయంత్రం ఐదు గంటలకు ఆచంటలో ముగించారు. వైసిపి అభ్యర్థి మాత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు నెలరోజులుగా వివిధ రాజకీయ పార్టీలు గ్రామాల్లో, పట్టణాల్లో, ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలు వంటి వాహనాలపై అభ్యర్థుల ఫ్లెక్సీలు, మైకులతో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ, రోడ్‌ షోలు నిర్వహించారు. ఎండ వేడిమి తట్టుకోలేక సాయంకాలం సమయంలో టిడిపి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ, వైసిపి అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కాంగ్రెస్‌ అభ్యర్థి నెక్కంటి వెంకట సత్యనారాయణ(సతీష్‌) రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలు హోరెత్తించారు. మొత్తానికి వైసిపి, టిడిపి అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో నిలిచి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

➡️