సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ టీజర్ విడుదలైంది. దర్శకుడిగా రోహిత్ శెట్టి తొలిసారి రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. జనవరి 19 నుంచి ఈ యాక్షన్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ విడుదల సందర్భంగా రోహిత్శెట్టి మాట్లాడుతూ, ‘మన పోలీసు అధికారుల పరాక్రమం, త్యాగం, ధైర్యాన్ని ఇందులో చూపించనున్నాం. దీనికోసం అంకితభావంతో పనిచేసిన టీమ్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నా మొదటి సిరీస్ అమెజాన్లో ప్రసారం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/15-9.jpg)