పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్‌-2’

May 11,2024 19:30 #border 2, #movie

సన్నీ డియోల్‌, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్‌, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్‌ రోల్స్‌లో నటించిన సూపర్‌ హిట్‌ హిందీ ఫిల్మ్‌ ‘బోర్డర్‌’. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్‌ సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తారు. యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా మరో లీడ్‌ రోల్‌ చేస్తారు. ‘బోర్డర్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్‌ దత్తా ‘బోర్డర్‌ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్‌ ఆలోచన.

➡️