‘ఇసైజ్ఞాని’లో ధనుష్‌

సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్ర ‘ఇసైజ్ఞాని’ పేరుతో సినిమాగా రానుంది. ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెర్క్యూరీ గ్రూప్‌, కనెక్ట్‌ మీడియా సంస్థలు నిర్మించనున్నాయి. బుధవారంనాడు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది. బాలీవుడ్‌లో ధనుష్‌, అమితాబచ్చన్‌ నటించి ‘షమితాబ్‌’ చిత్రానికి ఆర్‌.బాల్కి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తొలుత బాల్కి దర్శకత్వం వహిస్తారని భావించినా ఆ తర్వాత అరుణ్‌ మాథేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం. 7 వేలకు పైగా పాటలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఆయన పేరును చిరస్థాయిగా గుర్తుంచుకునేలా ‘ఇసైజ్ఞాని’గా బయోపిక్‌కు పేరు ఖరారు చేశారు.

➡️