బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం సాగుతోంది. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గన్న జాన్వీ తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్ నంబర్లను ప్రస్తావిస్తూ.. తన తండ్రి, చెల్లి, శిఖర్ పేర్లు చెప్పారు. అలాగే ‘మైదాన్’ సినిమా ప్రీమియర్ షోలో ఆమె ‘శిఖు’ (శిఖర్ పహాడియా) అనే లోగో ఉన్న నెక్లెస్ వేసుకొచ్చారు. ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి.