‘ఓజీ’ మాదే

పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంపై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. సినిమా నిర్మాణ బాధ్యతలు వేరే ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి వెళ్లాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందించింది. ‘ఓజీ’ మా సినిమా. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు’ అని ట్వీట్‌ చేసింది. జపాన్‌, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్థమవుతోంది. ప్రియాంకా ఆరుల్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

➡️