తెలంగాణ : గచ్చిబౌలి రాడిసన్ హౌటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ-10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ఫోన్ సిగల్ ఆధారంగా అధికారులు గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న ఏడుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ను పోలీసులు అరెస్టు చేశారు. నేడు గచ్చిచౌలి పోలీస్ స్టేషన్కు క్రిష్ను తీసుకువెళ్లనున్నారు. అనంతరం కేసుకు సంబంధించి క్రిష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు.
ఈ కేసులో సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ వాంగ్మూలం మేరకు.. రాడిసన్ హౌటల్ యజమాని కుమారుడు వివేకానంద ఈ నెల 24న మధ్యాహ్నం నుంచి తన స్నేహితులు రఘు చరణ్, సందీప్, శ్వేత, లిషి, నీల్, నిర్భరు, క్రిష్, సలగంశెట్టితో కలిసి అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీ నిర్వహించారని నిర్థారణ అయ్యింది. పార్టీలో 3 గ్రాముల కోకైన్ను వారు తీసుకున్నట్లుగా నిందుతుడు సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైనట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకు సంబంధించి ఫోన్పే లావాదేవీలను సేకరించనట్లుగా పోలీసులు వివరించారు.