హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్వైపై చిరుతను గుర్తించారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహారీ దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఎయిర్ పోర్ట్ ప్రహారీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కోండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది.