– అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు ఈ నెల 17 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం ఇద్దరు కూతుర్లు విదేశాల్లో వున్నందున వారిని కలిసేందుకు సతీమణి వైఎస్ భారతితో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 13న పోలింగు పూర్తికాగానే లండన్ పర్యటనకు వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సిబిఐ, ఇడి కేసుల్లో బెయిల్పై వున్న జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి జూన్ ఒకటి వరకు లండన్ పర్యటనకు అనుమతులివ్వాలని హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ పర్యటనకు సిఎం కుటుంబ సభ్యులు వెళ్తున్నట్లు తెలిసింది.