పోలింగ్‌ రోజున వాడే సిరాపై తప్పుడు ప్రచారం.. ఈసీ వార్నింగ్‌

ప్రజాశక్తి-అమరావతి : ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. ఓటర్ల వేళ్లపై చెరగని సిరాతో మార్కు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అలా చేయడం సరికాదన్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే చెరగని సిరా ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన ఏమాత్రం సహించబోము అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

➡️