ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో

Apr 29,2024 17:59 #cm
  • పొందూరు సభలో సిఎం వైఎస్‌ జగన్

పొందూరు : విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎన్నికలయ్యాక తన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విమర్శించారు. పొన్నూరులో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గన్న సీఎం జగన్‌.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దుష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన జగన్‌తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమి చేశాడో చెప్పకుండా జగన్‌ను తిడుతున్నాడర్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా? అని ప్రశ్నించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్‌ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో తాను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశామనీ, లంచాలు, వివక్ష లేకుండా రూ. 2.70 లక్షల కోట్లు అందించామన్నారు. నాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని గుర్తుచేశారు.

➡️