మణిపూర్ : మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. శనివారం తెల్లవారు జామున సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ పర్యవేక్షణలో ఉన్న సెక్యూరిటీ ఔట్ పోస్టుపై బాంబు దాడి చేశారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీ మృతి చెందగా.. ఇన్స్పెక్టర్ జాదవ్ దాస్, కానిస్టేబుల్ ఆఫ్తాబ్ హుస్సేన్లకు గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దాడికి తెగబడిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కాగా ఇండియా రిజర్వ్ బెటాలియన్ శిబిరానికి భద్రత కల్పించేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించినట్టు పేర్కొన్నారు.