Ram Charan birthday – తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న దంపతులు

తిరుపతి : నేడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 39వ పుట్టినరోజును పురస్కరించుకొని …. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. బుధవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో రాంచరణ్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనాంతరం ఆలయం బయటకు వచ్చిన రాంచరణ్‌ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

➡️