బిసిసిఐ సమావేశం వాయిదా

Apr 29,2024 23:12 #BCCI, #Cricket, #Sports, #T20, #World Cup
  • టి20 ప్రపంచకప్‌కు తుది జట్టుకు కసరత్తు

న్యూఢిల్లీ: న్యూయార్క్‌, వెస్టిండీస్‌ వేదికలుగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచప్‌కు భారతజట్టు ప్రకటన వాయిదాపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ-కోల్‌కతా జట్ల మధ్య ఐపిఎల్‌ మ్యాచ్‌ ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు టి20 ప్రపంచకప్‌కు జట్టు సభ్యుల కూర్పుపై సెలెక్షన్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో ప్రత్యక్షంగా హాజరుకాగా.. బిసిసిఐ సెలెక్షన్‌ కమి చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పర్చువల్‌గా హాజరైనట్లు సమాచారం. ఒకరిద్దరి ఆటగాళ్ల పేర్లు మినహా మిగిలిన జట్టు సభ్యులందరినీ సెలక్షన్‌ కమిటీ సిద్ధం చేసింది. బిసిసిఐ కార్యదర్శి జే షా ఎన్నికల ప్రచారంలో బిజీగా దృష్ట్యా జట్టు ప్రకటన చివర్లో వాయిదా పడింది. మంగళవారం అహ్మదాబాద్‌లో మరో దఫా వీరంతా జే షాతో సమావేశమైన అనంతరం తుది జట్టు ప్రకటించనున్నారు.

➡️