భారత క్రికెట్ జట్టు, సిఎస్కే మాజీ కెప్టెన్, ఎమ్ఎస్ ధోనీ ఐపీఎల్లో చెన్నై టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి తమిళులంతా ఎంతగానో ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో 103 ఏళ్ల అభిమానిఎస్ రాందాస్ కూడా ఉన్నారు. అతని గురించి తెలుసుకున్న ధోని ఆయనకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్ పెట్టిన చెన్నై జెర్సీని.. బహుమతిగా ఇచ్చారు. ‘థ్యాంక్స్ తాతా.. ఫర్ ది సపోర్ట్’ అని రాందాస్ పేరు సహా ఆయన వయసు ఉన్న ఆ జెర్సీపై ధోనీ రాశాడు. ఆ జెర్సీని అందుకున్న రాందాస్ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.
103 Years Young Fan's reaction when MS Dhoni send the signed Jersey to him.💛 [ CSK YT ] pic.twitter.com/OY88ACqObg
— 🎰 (@StanMSD) May 4, 2024