నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం

హైదరాబాద్‌ : బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో ఈ రోజు రెండు పథకాలను ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మి పథకాలను లాంచ్‌ చేశారు. ఈ సమయంలోనే జరీన్‌కు ఆర్థిక సాయం అందించారు. గత మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో 50 కిలోల విభాగంలో జరీన్‌ స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో ఆమె రెండో బంగారు పథకాలు సాధించింది.

➡️