థామస్‌కప్‌ క్వార్టర్స్‌కు భారత్‌

Apr 29,2024 23:10 #Badminton, #Sports

ఛెంగ్డు(చైనా): థామస్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్లోకి డిఫెండింగ్‌ ఛాంపియ న్‌ భారత్‌ దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్‌-సి రెండో లీగ్‌ పోటీలో భారత్‌ 5-0తో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు 21-15, 21-15తో హారీ హాంగ్‌ను చిత్తుచేయగా.. డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ 21-17, 19-21, 21-15తో బెన్‌ లెన్‌-సీవెన్‌ వెడీను ఓడించి భారత్‌కు 2-0 ఆధిక్యతలో నిలిపారు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-16, 21-11తో నదీమ్‌ను, రెండో డబుల్స్‌లో ధృవ్‌ జొరెల్‌-అర్జున్‌ జంట 21-17, 21-19తో చిత్తుచేసి భారత్‌కు తిరుగులేని 4-0 ఆధిక్యతను సాధించారు. ఇక చివరి సింగిల్స్‌లో కిరణ్‌ జార్జి 21-18, 21-12తో చోలన్‌ కళ్యాన్‌ను చిత్తుచేయడంతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ సాధించింది. ఇక ఉబెర్‌ కప్‌లో మహిళలజట్టు సింగపూర్‌ను ఓడించి ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

 

➡️