ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో నిన్న మధ్యాహ్నం ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఇషాన్ ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి ఉల్లంఘించాడు. తన తప్పును ఇషాన్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే.