ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై జట్టు అధికారికంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ముంబై బాటలోనే ఆర్సీబీ, గుజరాత్ పంజాబ్ జట్టు ఉన్నాయి. ఈ జట్లు ఒక్క మ్యాచ్ లో ఓడిపోయిన ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకొనున్నాయి. అలాగే ఢిల్లీ, చెన్నై జట్లకు ప్లే ఆఫ్స్ ఆశలు ఉన్నప్పటికి టేబుల్ టాప్ 4లో ఉన్న జట్లు గెలుపోటములపై ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరీ ఈ సీజన్లో ఏ ఏ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటాయో తెలియాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే మరి.