ఉపాధ్యాయుడిని నియమించాలి : సిపిఎం

మాట్లాడుతున్న సిపిఎం నేత

ప్రజాశక్తి -అనంతగిరి:రెండు మండలాల సరిహద్దు పివిటిసి పట్కదౌడ గ్రామంలో ఉపాధ్యాయుడుని తక్షణమే నియమించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌,నాగులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆ గ్రామంలో సందర్శించిన ఆయన పివిటిజి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు మాట్లాడుతూ, తమ గ్రామాంలో ఉపాధ్యాయుడు అకాల మరణంతో సుమారు ఆరు నెలలకు పైగానే పాఠశాల మూత పడిందని తెలిపారు. దీంతో విద్యార్థుల చదువులు సాగలేదన్నారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, పట్క దౌవడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 25 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఆరు నెలల నుంచి ఉపాధ్యాయుడిని నియమించక పోవడంతో విద్యార్థులకు విద్య అందలేన్నారు.విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడిని నియమించి విద్యాబోధన అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️