ప్రజాశక్తి – కడప దళిత ద్రోహి చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని వైసిపి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్ వినోద్ కుమార్ అన్నారు. ప్రజాగళం యాత్రలో శింగణమల వైసిపి అభ్యర్థి వీరాంజనేయులుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ శనివారం కడప కొత్త బస్టాండ్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబన్లుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజానికి పేదలు, దళితులంటే చంద్ర బాబుకు మొదటి నుంచి చాలా అలుసు అని చెప్పారు. తరచూ వారిని హేళన చేస్తూ మాట్లాడడం ఆయనకు పరిపాటిగా మారింది అన్నారు. ఆయన సిఎంగా ఉన్న సమయంలోనే ఎస్లుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాలంటే బాబు దష్టిలో వారు కేవలం తమకు ఓట్లు వేసి, అగ్రకుల దురహంకారుల అడుగులకు మడు గులొత్తే వారు మాత్రమే అన్నారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, ఎస్సి సెల్ నగర అధ్యక్షులు కె. బాబు, నగర ప్రధాన కార్యదర్శి ఎస్. లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు కె. బాబు, త్యాగరాజు, చెన్నయ్య, బండి ప్రసాద్, రాజా జిల్లా అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మల్లూరి. జాషువ, శివా నాయక్, వేణుగోపాల్ నాయక్ నగర అధ్యక్షులు నాగరాజు, విజయకిశోర్, సిహెచ్. సునీల్, సాయి బాబా,డేవిడ్,సందీప్ రెడ్డి, మరియు జిల్లా , నగర నాయకులు జయచంద్రా రెడ్డి, రాంమోహన్ రెడ్డి, మధు, సంపత్ కుమార్, రవి, మనోజ్, ఇలియస్, పవర్ అల్తాఫ్, మనోజ్, రమేష్ రెడ్డి, అలీ, అంజి, డేవిడ్, నాగ మాల్లారెడ్డి, రమేష్, మహిళా నాయకులు చైతల్య, విజయకుమారి, తులసమ్మ, శివమ్మ పాల్గొన్నారు.