ప్రజాశక్తి -హుకుంపేట:మండల కేంద్రంలోని వారపు సంతల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వారపు సంతలో ట్రాఫిక్ సమస్యతో గంటల పాటు రహదారి స్తంభించి పోయింది. మొదకొండమ్మ గుడి నుండి కమయ్యా పేట రోడ్డు వరకు ట్రాఫిక్తో నిండి పోయింది. జనాలతో సంత కిక్కిరిసి పోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, రైతులు ఇబ్బందులు పడ్డారు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.