న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Mar 12,2024 21:22

ప్రజాశక్తి – కడప అర్బన్‌ గ్రామ పంచాయతీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దారి మళ్లించి, గ్రామాల అభివద్ధిని నిర్వీర్యం చేసి, పంచాయతీ సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి ఏంటో చూపిస్తామని ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు. సర్పంచ్‌ల న్యాయబద్ధమైన 16 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరిం చాలని ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచ్‌ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఉమ్మడి జిల్లాలోని సర్పంచులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ.. సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేం ద్రప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు వాటా నిధులు ఇవ్వకపోగా, స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధి కోసం పంపిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు వేలకోట్ల రూపా యలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు దారి మళ్లించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ వాలంటరీలకు తాము వ్యతిరేకం కాదని, సర్పంచుల ఆధ్వర్యంలో వారు విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. మూడు కోట్ల, 60 లక్షల మంది గ్రామస్తుల సమ స్యలు పరిష్క రించాలని, ప్రభుత్వం ముందుంచుతే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసిపి ప్రభుత్వం సర్పంచ్‌లకు చేసిన అన్యాయాన్ని టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీల నేతలకు తెలిపామని చెప్పారు. వైసిపి సర్పంచులు కూడా ఉద్యమానికి మద్దతు తెలిపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు రెండు నెలల వ్యవధి ఉందని, నిధులు ఇస్తే మంచిదని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. జగన్‌ను ఇంటికి పంపితేనే పంచాయతీల్లోని గ్రామాలు అభివద్ధి సాధ్య పడుతుందని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు మునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా వైసిపి ప్రభు త్వానికి చీమకుట్టినట్లు లేకపోవడం దారుణం అన్నారు. గ్రామ వాలంటరీలను, గ్రామ సచివాల యాలను పంచాయతీల్లో విలీనం చేసి, సర్పంచుల ఆధ్వర్యంలో అన్ని రకాల అభివద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ సింగంశెట్టి సుబ్బరామయ్య, ఉమ్మడి కడప జిల్లా పంచాయతీల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

➡️