బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌

ఛైర్‌పర్సన్‌ ఇంద్రజను కలిసి బొకే అందిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి

            హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా శ్రీకాంత్‌ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం కమిషనర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్‌ తన ఛాంబర్‌లో మున్సిపల్‌ ఎంఈ వెంకటరమణ, డిఈలు బాలసుబ్రమణ్యం, వాణి, ఎఈలు నాగేంద్ర, జనర్దాన్‌తో పాటు ఎసిపి సునీల్‌, మేనేజర్‌ రామాంజినేయులు, ఆర్‌ఒ సుధాకర్‌, ఆర్‌ఐలు రాము, జకావుల్లా, ఇతర విభాగాల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది ఆయన్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సర్‌, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

➡️